హైదరాబాద్ : డిసెంబర్ వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్పై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్సెంటర్ స్థాయి, పీహెచ్సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కొవిడ్ టీకా వేసుకునేలా చూడాలని అన్నారు.
అలాగే ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించి.. అక్కడే వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.55కోట్ల డోసులు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.60కోట్ల డోసులు వేశామని.. మరో 1.90కోట్లు వేయాల్సి ఉందన్నారు. వ్యాక్సినేషన్ 80శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో మంత్రి ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
డిసెంబర్లోగా వందశాతం వ్యాక్సినేషన్ జరుగాలని, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ దీక్షతో పని చేయాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. రక్తహీనతపై అవగాహన కల్పించి, అవసరమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాకాటి కరుణ, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.