కామారెడ్డి : బిక్కనూరు మండలం అంతంపల్లిలో విషాదం నెలకొంది. వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో అంతంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. అంతంపల్లి శివారులో వాహనం ఢీకొని భర్త సిద్ధయ్య(50) మృతి చెందాడు. భర్త మరణవార్త తెలుసుకొని మరిదితో కలిసి భార్య ఘటనాస్థలికి బయల్దేరింది. బిక్కనూరు వద్ద బైక్పై వెళ్తున్న సిద్ధవ్వ, ఆమె మరిది కింద పడ్డారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్ధవ్వ(44) మృతి చెందింది. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.