అన్నదాతల హర్షం
ఊపందుకోనున్న సాగు పనులు
ఎల్లారెడ్డి రూరల్/విద్యానగర్/బాన్సువాడ/బిచ్కుంద, జూన్ 10 : జిల్లావ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం మధ్యా హ్నం జోరు వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో అరగంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు పట్టణమంతా జలమయమైంది. పట్టణంలోని బీసీ కాలనీ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ య్యాయి. పలు ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇండ్లలోకి వర్షపు నీరు చేరకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ కాలనీ ప్రజలు కోరారు.
జిల్లాకేంద్రంలో గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృత్తమై ఉండి సా యంత్రం భారీ వర్షం కురిసింది. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కురిసిన వర్షం మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది.
బాన్సువాడలో బుధవారం అర్ధరాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మృగశిర కార్తె నుంచి రైతులు పొలంలో నారుమడులు వేయడంతోపాటు పంట పొలాల్లో దుక్కులు దున్నే పనిలో పడ్డారు. గురువారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో రైతులు సాగు పనులు ప్రారంభించారు.
బిచ్కుంద మండలంలో గురువారం వర్షం కురిసింది. రుతుపవనాలు ముందే రావడంతో వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్త లు పేర్కొనడంతో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున రైతులు ఆరుపడి పంటలు సాగు చేసుకోవాడనికి సిద్ధమవుతున్నారు. వానకాలం సీజన్లో సోయా, కంది, పెసర, మినుము, వి విధ పంటలను రైతులు సాగు చేస్తారు. పలుచోట్ల సాగు పనులను ప్రారంభించారు.