రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ఒప్పుకున్నారు. ఆ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే.: సీఎం రేవంత్
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి.. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తిం చాలి అని కేసీఆర్ సర్కారు అనేక షరతులు పెడితే కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ప్రాజె క్టులు అప్పజెప్పకుండా తొమ్మిదిన్న రేండ్లుగా దాటవేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాక ముందే ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పిం ది. నాడు కేంద్రంలోని కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనా లను దెబ్బతీస్తే.. నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు నెలల్లోనే ప్రాజెక్టులను అప్పగించి తీరని ద్రోహం చేసింది.
నాగార్జునసాగర్ను ఆంధ్రప్రదేశ్ ఆక్రమించుకుంటున్నా మాజీ సీఎం కేసీఆర్ చూస్తుండి పోయారు. పల్లెత్తు మాట్లాడలేదు? : సీఎం రేవంత్
అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలరోజు జరిగింది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండదు. ఇలాంటి నిర్ణయాలన్నీ సీఎస్, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక నెలరోజులకే కేఆర్ఎంబీ సమావేశమైతే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ కనీసం అభ్యంతరం తెలుపలేదు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల అప్పగింత కొనసాగుతుందని మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రాజెక్టును ఏపీ పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారని కనీసం ప్రశ్నించలేదు.