హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీజే అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. భూకేటాయింపునకు తగిన కారణాలు ఉన్నాయని ఏజే ప్రసాద్ చెప్పడంతో సంబంధిత పిల్పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.