EAMCET counselling | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది. ఈ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ రూపకల్పనపై చర్చించి ఖరారు చేశారు. తొలి విడత కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి, రెండో విడత జూలై 21 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 8, 9 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్మిట్టల్ వెల్లడించారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు.
ఇంజినీరింగ్ సీట్లు మిగులకుండా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సెలింగ్కు సమాంతరంగా ఎంసెట్ కౌ న్సెలింగ్ను నిర్వహించేలా షెడ్యూల్ను రూ పొందించారు. జూన్ 18న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రానున్నాయి. జూన్ 19 నుంచే జ్యోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నది. ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ జూన్ 26 నుంచి మొదలవుతుంది. ఏటా జ్యోసా సీట్ల కేటాయింపు ఆరు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జ్యోసా కౌన్సెలింగ్తోపాటే ఎంసెట్ కౌన్సెలింగ్ ముందుకు సాగనున్నది. ఎంసెట్ తొలి వెయ్యి ర్యాంకర్లలో అత్యధికులు జ్యోసా కౌన్సెలింగ్లో పాల్గొని, ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పొందుతుండటం తో వారు చేరిన ఎంసెట్ ర్యాంకుల ద్వారా చేరి న సీట్లన్నీ మిగిలిపోతున్నాయి. ఆయా సీట్లను ఇతరులకు కేటాయించలేని పరిస్థితి గత కొంతకాలంగా నెలకొంటున్నది. దీంతో వ్యూహాత్మకంగా షెడ్యూల్ ఖరారు చేశారు.