నల్లగొండ : పార్టీ అదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి తన తనయుడు అమిత్ పోటీ చేస్తారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నాలుగు జిల్లాలో మాత్రమే కాంగ్రెస్కు(Congress) అనుకూలంగా ఉంది మిగతా జిల్లాలలో న్యూట్రల్గా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఒడిపోతదని అనుకోలేదు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆస్తుల మీద స్వేదపత్రం విడుదల చేయడంతో బీఆర్ఎస్ పాలన ప్రయోజనాలు ప్రజలకు అర్థమవుతుందన్నారు. పార్లమెంటుపై పొగ బాంబ్ దాడి కేంద్రంలోని బీజేపీ పాలన లోపాలను స్పష్టంగా చూపించిందన తెలిపారు. ప్రభుత్వాలు రాష్ట్ర భవిషత్తు గురించి, అభివృద్ధి కోసం పని చేయాలి. ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వానికి రెండు వేల ఐదు వందల కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు.