నల్లగొండ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నల్లగొండలోని చాకలి ఐలమ్మ భవన్ ఆమె విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ..వెట్టిచాకిరిని వ్యతిరేకిస్తూ రజాకార్లు, దేశ్ ముఖ్లను ఎదురించి పోరాడిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి , జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.