వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన రైతు గాదం రాజు పత్తికి మార్కెట్లో ఈ ధర లభించింది. గాదం రాజు 17 బస్తాల పత్తిని మార్కెట్కు తీసుకొచ్చాడు.
గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో నిన్న క్వింటాల్కు రూ.10,950 పలికి ఆ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డుగా సృష్టించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ రూ.10,850 పలికింది. నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాల్కు రూ.10,500 నమోదైంది. పత్తికి అనుకున్నదానికంటే ధరలు వస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.