ఖమ్మం, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డా రు. కాగా ఇదే జిల్లా తిరుమలాయపాలెంలో పత్తి మిల్లుకు తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయలేదని, అనేక కొర్రీలు పెట్టి తమను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారిని ఘె రావ్ చేశారు. సీసీఐ మేనేజర్ అర్జున్, అసిస్టెం ట్ మేనేజర్ అవినాశ్ ఖమ్మం ఏఎంసీ పత్తి యార్డులో క్రయవిక్రయాల పరిశీలనకు వచ్చా రు. వీరిని చూసి ఆగ్రహానికి గురైన రైతులు వారిని చుట్టుముట్టారు. ఇక్కడి ఖరీదుదారు లు సవాలక్ష కొర్రీలతో తమను అరిగోస పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏ ర్పాటు చేయకుండా పరోక్షంగా ప్రైవేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు. తేమ శాతం 12లోపు ఉన్నదీ లేనిదీ తమకు తెలియకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆ వేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారుల వైఖరి కారణంగానే తాము మద్దతు ధర పొందలేక పోతున్నామని మండిపడ్డారు. అక్కడికి వచ్చి న జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీం, మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రవీణ్కుమార్ రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఖమ్మం మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటు విషయంలో మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
తిరుమలాయపాలెం మండలం గోల్తండాలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తమ పత్తిని కొనుగోలు చేయని సీసీఐ అధికారులు.. ప్రైవేటు వ్యాపారులు తెచ్చిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటన్ మిల్లు గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వారు కూడా రైతులే అనుకున్నామని అధికారులు సమాధానం చెప్పడం గమనార్హం.