హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగసంస్థలతోపాటు కుల వృత్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షౌరవృత్తిలోకి కార్పొరేట్ సంస్థలను కేంద్రం ఆహ్వానించిందని, దీనివల్ల లక్షలాది కుటుంబాలు ఉపా ధి కోల్పోయి రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షౌరవృత్తిలోకి ప్రైవేటు, కార్పొరేట్ పెట్టుబడిదారులు రాకుండా నిషేధం విధించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో సుమారు 3 లక్షల షాపుల్లో 10 లక్షల కుటుంబాలకు క్షౌరవృత్తి జీవనాధారంగా ఉన్నదని చెప్పారు. ఈ వృత్తిలోకి రిలయన్స్, హార్బిన్ క్లబ్, నేచురల్ సంస్థల ప్రవేశంతో క్షౌరవృత్తిదారుల జీవితాలు చిన్నాభిన్నామవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షౌరవృత్తికుటుంబాలకు సొసైటీలను ఏర్పాటు చేసి, నిధులిచ్చి, పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి ఉపాధిని మెరుగుపర్చాలని కోరారు.