న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా రాబోయే సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గాయం తీవ్రత దృష్ట్యా భుజానికి సర్జరీ చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 9 నుంచి టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీ జట్టును నడిపించే ఆటగాడి కోసం ప్రాంఛైజీ ఇప్పటికే చర్చలు మొదలెట్టింది.
కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. ప్రస్తుత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా అనుభవజ్ఞులైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్/ రహానెలపై ఫ్రాంఛైజీ మొగ్గుచూపుతుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్కు చాలా ఏండ్లుగా కెప్టెన్గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ను ఇటీవల వేలంలో ఢిల్లీ దక్కించుకున్నది. ఒకవేళ స్మిత్కు పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గత సీజన్లో పరుగుల వరద పారించిన ఆ జట్టు కీలక ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టును ముందుండి నడిపించే సత్తా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. త్వరలో కెప్టెన్సీపై ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించే వీలుంది.
కోహ్లీ ముందుకు..రాహుల్ వెనక్కి
ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
ఇంగ్లాండ్కు షాక్..కెప్టెన్ మోర్గాన్ రెండో వన్డేకు దూరం!
పెళ్లి చేసుకుంటున్న స్టార్ స్పిన్నర్.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం