దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ్లీ ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకు చేరుకోగా టీ20 సిరీస్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు.
ఐదో టీ20లో కోహ్లీ(80), రోహిత్(64) మెరవడంతో టీమ్ఇండియా భారీ విజయం సాధించింది. రోహిత్ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరచుకొని 14వ ర్యాంకులో నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ 26వ స్థానం సంపాదించాడు. ఇంగ్లాండ్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
ఇంగ్లాండ్కు షాక్..కెప్టెన్ మోర్గాన్ రెండో వన్డేకు దూరం!
పెళ్లి చేసుకుంటున్న స్టార్ స్పిన్నర్.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం