చెన్నై: ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) త్వరలో ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని జట్టు మార్చి 26లోగా చెన్నై నుంచి ముంబై చేరుకోనుంది. ప్రస్తుతం చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్లో ఉన్న ఎల్లో బ్రిగేడ్ మార్చి 26 నుంచి ముంబైలో సాధన చేయనుంది. స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ముంబైలోనే క్వారంటైన్ పూర్తైన తర్వాత జట్టు సభ్యులతో కలవనున్నాడు. ముంబై వేదికగా చెన్నై ఐదు మ్యాచ్ల్లో తలపడనుంది. మేం కచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తాం. మార్చి 26లోగా మేమంతా ముంబైకి వెళ్లబోతున్నామని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
కోహ్లీ ముందుకు..రాహుల్ వెనక్కి
ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
ఇంగ్లాండ్కు షాక్..కెప్టెన్ మోర్గాన్ రెండో వన్డేకు దూరం!
పెళ్లి చేసుకుంటున్న స్టార్ స్పిన్నర్.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం