హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని ముందుగా ఒప్పించిన తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. ఎక్కడి నుంచి జలాలను తరలించాలనే అంశాన్ని కూడా ముందే నిర్ణయించాలని స్పష్టంచేసింది.
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) వార్షిక సమావేశం చైర్మన్ భోపాల్సింగ్ నేతృత్వంలో వర్చవల్గా మంగళవారం కొనసాగింది. సమావేశంలో తెలంగాణ, ఏపీతోపాటు గోదావరి బేసిన్లోని ఇతర రాష్ర్టాలు కూడా పాల్గొన్నాయి.