పల్లెలు అంటేనే ప్రకృతికి నిలయాలు. ఇలాంటి ప్రకృతి సౌందర్యాలకు మరింత శోభనిచ్చేలా.. పల్లెలకు కొత్తందం తెచ్చేలా ప్రకృతి వనాల నిర్మాణం జరుగుతోంది. పట్టణాలు, నగరాలకు పరిమితమైన పార్కులు ఇప్పుడు పల్లెల్లోనూ కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ వనాలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపొందిన ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్ల కొణిజర్ల మండలం సింగరాయపాలెం, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని పల్లె ప్రకృతి వనాల ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు.