హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) విద్యుత్తు ఇంజినీర్లను కోరింది. గృహజ్యోతి పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు పాటుపడాలని టీఎస్పీఈఏ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్రావు, పీ సదానందం సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి సహా పార్లమెంట్ ఎన్నికలు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.