నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నారు.
అలాగే వచ్చే రెండు సంవత్సరాలలో, మొత్తం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు.
గ్రామాలలో బడి ఈడు పిల్లలంతా బడిలో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఇందుకై ఇంకా అవసరమైన నిధులు దాతల ద్వారా సేకరించడానికి నావంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ప్రాధానోపాధ్యాయులకు సూచించారు. కరోనా వలన విద్యార్థులు చాలాకాలంగా ప్రత్యక్ష విద్యకు దూరమయ్యారని త్వరలో బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచి నాణ్యమైన విద్యను అందించుటకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి మండల విద్యాధికారులు నరసింహ, నరసింహ మూర్తి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు జాన్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం