హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే హఠాన్మరణం పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, నాందేవ్ బుధవారం గుండె పోటుతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత