సూర్యాపేట : విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రూపొందించిన 2022 క్యాలెండర్,డైరీలను ఆయన గురువారం ఉదయం సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యుత్ రంగంలో ఏర్పడ్డ సంక్షోభమే మూలమైందని ఆయన గుర్తుచేశారు. ఆ విషయాన్ని మొట్టమొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి చెప్పారు.
అటువంటి రంగాన్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ముందుకు తీసుకు పోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ కే మాజిద్, నాయకులు పర్వతాలు, దోసకాయల శ్రీనివాస్, వేణుగోపాల్,యాదయ్య, సత్తిరెడ్డి, వహిద్ తదితరులు పాల్గొన్నారు.