నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 3.25 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 గేట్లను ఎత్తివేసి 3.52 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1087 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటిమిట్టం 1091 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టు వరద స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్టులోకి 36,400 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అధికారులు 54,416 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకుగాను 1404.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.1 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.