హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను కోరారు. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సీసీఐకి లేఖ రాశారు. ఇప్పటికీ మార్కెట్లకు పత్తి వస్తున్నదని, కొందరు రైతులు మూడోసారి కోస్తుండటంతోపాటు మరికొందరు రైతుల వద్ద మొదటి పంట పత్తి నిల్వ ఉన్నదని తెలిపారు.