హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను, ఎంసీహెచ్ కిట్లను సమయానికి అందజేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థపై సమీక్షించారు.
కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనితీరును పరిశీలించారు. మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలను, కాలేజీల అప్గ్రేడేషన్, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో టీఎస్ఎంస్ఐడీసీ ఎండీ ఆర్వీ కర్ణణ్, ఈడీ కౌటిల్య, సీఈ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.