భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కూంబింగ్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ కరెంటు షాక్తో మరణించారు. కాటారం మండలం నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వన్యప్రాణులను వేటాడానికి దుండగులు ఇనుప కంచెకు కరెంటు పెట్టారు. అయితే కరెంటు తీగలు పట్టుకోవడంతో కానిస్టేబుల్ ప్రవీణ్ (Constable Praveen) అక్కడికక్కడే మరణించారు. తోటి సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతిచెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరెంటు తీగలు పట్టిన దుండగులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.