కాగజ్నగర్, జూన్ 23 : ‘సర్’ పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో మంగళవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతోపాటు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరిట పశ్చిమబెంగాల్, ఛండీగడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో లక్షలాది ఓట్లు తొలగించారని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయి రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పకడ్బందీగాచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదుకోసం జిల్లా ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జి, మండలస్థాయి ఇన్చార్జిలతో పాటు బీఎల్ఏలను సైతం నియమించారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నమోదుకు కావాల్సిన పత్రాలు అందించి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి జగన్ మోహన్ పాల్గొన్నారు.