అచ్చంపేట, అక్టోబర్ 27: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి, విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి యత్నించారు. శుక్రవారం మాచారంలో రాంచంద్రయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యే సమక్షలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం గ్రామంలో పర్యటించిన ఆయన తిరిగి వస్తున్న క్రమంలో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ముందుకు కదిలారు. ఈ ఘర్షణలో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో బతుకమ్మ వేడుకల్లో తన సతీమణి అమల మాట్లాడుతుండగా.. మైక్ వైర్ కట్చేసి చిల్లరగా వ్యవహరించి దాడికి పాల్పడేందుకు యత్నించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.