Congress | గట్టు, ఏప్రిల్ 17: తన పార్టీ నాయకులే తనను ఓడించారని కాంగ్రెస్ నేత, జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటే ఆమె మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనాదరణ, ఇలాంటి కార్యకర్తలు అభిమానం చూసే 50 వేల మెజార్టీతో గెలుపు ఖాయమని అనుకున్న.
కానీ నా అనుకున్న వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేమి? ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సీఎం రేవంత్రెడ్డి అందరినీ కాదని నాకు టికెట్ ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ సమావేశం జరిగినా వేదిక ముందుకు వెళ్లడానికి మనసు ఒప్పడంలేదని అన్నారు. అప్పటిలా వెన్నుపోట్లు పొడవకుండా ఈ సారైనా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.