హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా ణ): కాంగ్రెస్లో మరో కీలక వికెట్ పడింది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీకి గుడ్బై చెప్పారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో తనకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ పార్టీలోకి కొత్తగా వచ్చిన కొందరి తీరుతో పార్టీని వీడుతున్నట్టు రేవంత్రెడ్డిని ఉద్దేశించి అన్నారు.