హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ధరణి రద్దు నినాదం వెనుక భూములను గుంజుకునే కుట్ర దాగున్నది. రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన భూములపై కాంగ్రెస్ కన్నేసింది. వాటిని గుంజుకోవడానికి ప్రస్తుతం ధరణి పోర్టల్ వారికి అడ్డంగా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాత పద్ధతిలో రికార్డులు ఉండేవి. దీంతో నాయకులు ఇష్టారాజ్యంగా భూములు గుంజుకునేవారు. చోటా మోటా లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు భూముల మీద సంపాదించుకునేవారు.
పెద్ద నేతలు తమ పరపతిని ఉపయోగించి రైతుల భూములను రాత్రికిరాత్రే పేర్లు మార్చేసేవారు. ఎకరాలకొద్దీ భూములను తమ పేర్లమీదికి బదలాయించుకునేవారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేవారు. అటవీభూములను కూడా ‘హస్త’గతం చేసుకునేవారు. ఇప్పుడు పోర్టల్ అమలులో ఉండంటతో ఇది సాధ్యం కాదు. కాబట్టే ధరణి అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నారు.