Congress Party | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసుపాలైంది. ఈ మేరకు సోమవారం సరూర్నగర్లో యువ సంఘర్షణ పేరుతో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నలుగురిలో నగుబాటుకు గు రైంది. యూత్ డిక్లరేషన్లో పేర్కొన్న అంశా లు, వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే..
తొలి క్యాబినెట్ మీటింగ్లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. ఇ ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కేసులను ఎత్తివేస్తదో వారికే తెలియాలి.
రాష్ట్రం ఏర్పాటైన తొలిరోజుల్లోనే అమరవీరుల కుటుంబాలన్నింటికీ..ఇంటికో ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించింది. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్లో రూ.25 వేల పెన్షన్ ఇస్తానని చెప్పింది.
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సు మారు 1.35 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 92 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అయినా ఉద్యోగ కల్పనపై కొత్తగా హామీ ఇవ్వడమేంటో?
తాము అధికారంలోకి వస్తే జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే ఐటీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ‘తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)’ పేరుతో కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా ఈ పథకం అమలవుతున్నది.
కార్మికశాఖ ఆధ్వర్యంలో టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలను గుర్తించి యువతకు ఉపాధి కల్పిస్తున్నది.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు అతీగతీ లేదు. కానీ కొత్త యూ నివర్సిటీల గురించి మాట్లాడుతున్నది.
18 ఏండ్లు పైబడిన చదువుకునే ప్రతి యు వతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తే మహిళా సాధికారతసాధ్యమవుతుందా?
టీఎస్పీఎస్సీని బలోపేతం చేస్తామంటోం ది కాంగ్రెస్. ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో పోల్చితే టీఎస్పీఎస్సీ బలంగా ఉన్నది. యూపీఎస్సీతో సహా మిగిలిన పీఎస్సీలన్నీ కూడా మన విధానాలను కాపీ చేస్తున్నాయి.