కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హస్తం పార్టీలో ఎవరో ఒకరు తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్లో వర్గ విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
లింగంపేట మండలం కోమట్పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఇద్దరికి సంబంధించిన మద్దతుదారులు దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై దాడులు చేసుకుంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం కోమట్పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మద్దతుదారులు కొట్టుకున్నారు.. pic.twitter.com/alf765vAnW
— Namasthe Telangana (@ntdailyonline) May 24, 2022