Congress Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం ఈ నెల 9న భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. సభను ఎల్బీ స్టేడియంలో నిర్వహించనుండగా.. దానికి కృతజ్ఞత సభగా నామకరణం చేసింది. సభకు పార్టీ కీలక నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. సీఎంగా నియామకమైన రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ ఠాక్రేకు ధన్యవాదాలు చెప్పారు.