హైదరాబాద్ : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ( MLA Anirudh Reddy ) సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly sessions) బాంబు పేలుస్తానని సచివాలయం ఎదుట మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తెలంగాణ రాష్టంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో కోరుతానని అన్నారు.
సారా తాగి 115 సంవత్సరాల పాటు బ్రతికిన జనం, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతు న్నారని పేర్కొన్నారు.సైన్టిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని,ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు.మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా సారా దుకాణాలను నడుపుతున్నారని వివరించారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననని స్పష్టం చేశారు.