MLA Rajagopal Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక సమస్యల పరిష్కారంపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి చురకలంటించారు.
అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వ్యవహరించాలి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు.
అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను.
మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు… pic.twitter.com/ENULM3R5sm
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) September 19, 2025