రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీలనుంచి నాయకులు గులాబీబాటపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలోగల ఎమ్మెల్యే గాదరి కిశోర్ నివాసంలో ఆయన సమక్షంలో 40 కుటుంబాలు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా గాదరి కిశోర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయన్నారు. దళిత బంధు పథకాన్ని నిరుపేద దళితులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని గాదరి కిశోర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, బొంకూరి సురేశ్, బొజ్జ సాయికిరణ్, చింతకుంట్ల విటల్ మహరాజ్, మందుల నరేశ్, తదితరులున్నారు.