రంగారెడ్డి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు చౌదరిగూడ మండలం పద్మారం గ్రామ పంచాయతీలోని రాంజతాండకు చెందిన 40మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు.
దళితబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయమన్నారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు కోనెరు నర్సింగరావు, కొండి యాదయ్య, నారాయణగౌడ్, మల్లేష్, కుర్వ నర్సింహులు, రమేష్, వీరన్న, వంశి, బోయ బాల్రాజు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ