BRS Party | జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన పలు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. యాదవ సంఘం నేత పెద్ద గొల్ల సలేంద్ర సోమన్న అధ్వర్యంలో సుమారు 50 యాదవ కుటుంబాలు, అలాగే బీఆర్ఎస్ యువ నేత బాబ్బూరి శ్రీకాంత్ గౌడ్ నాయకత్వంలో దేవరుప్పుల మండలం పెద్ద మడూరుకు చెందిన బీజేవైఎం నేతలు ఆకవరం రాజు, మల్లేశ్ వైఎస్సార్పీటీ నేత నేత వీరేశ్ ఆధ్వర్యంలో 50 మంది నాయకులు బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు. రాయపర్తి మండలం కోలన్పల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన పాలకుర్తి యాదవ సంఘం, ఇతర పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్నివర్గాలకు న్యాయం జరిగిందన్నారు. మంత్రి ఎర్రబెల్లిని మరోసారి భారీ మెజారిటీతో గెలిస్తామని స్పష్టం చేశారు.