సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు జరగడం అభినందనీయమన్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు(ఎస్) మండలం రామన్న గూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెట్టు రాంరెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు.. గులాబీ కండువాను కప్పుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే విపక్ష పార్టీలు ఖాళీ అయ్యాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. ఎ
టీఆర్ఎస్లో చేరిన వారిలో జంగాల గౌరయ్య, జంగాల మరియమ్మ, బొక్క ఉపేందర్ రెడ్డి, గొలుసు వెంకయ్య, ఆలకుంట్ల ఉప్పలయ్య, గొలుసుల ముత్తయ్య, పుల్లూరి సైదులుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహ రావు, కొనతం సత్యనారాయణ రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.