Andole | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం( Andole Constituency )లో కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి భారీ షాక్ తగిలింది. చౌటకూరు మండల పరిధిలోని చక్రియాల్ గ్రామానికి( Chakriyal ) చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్రావు( Minister Harish rao ), ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్( MLA Kranthi Kiran ) సమక్షంలో కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆందోళ్ కృష్ణ, అనంతరామి రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయని తెలిపారు. చిత్తశుద్ధితో పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని, అలాంటి వారికి తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు.