Revanth Reddy | నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు వర్గాలు తన్నుకున్నారు. బహిరంగంగానే ముష్టి యుద్ధానికి దిగారు. టీపీసీసీ పేపర్ లీకేజీ ఘటనపై రేవంత్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు దీక్షలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తన ముందే సుభాష్ రెడ్డి, మదన్మోహన్ రావు వర్గాలు రెండుగా చీలిపోయి కొట్లాడుకోవడంతో రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కాంగ్రెస్ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఇరువర్గాలు వినిపించుకోలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉండిపోయారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి.. సుభాష్ రెడ్డి వర్గానికే అనుకూలంగా ఉన్నాడని మదన్మోహన్ రావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన దీక్ష స్టేజి మీదకు మదన్ మోహన్ ఒక్కడినే అనుమతించాలని సెక్యూరిటీకి సూచించడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు వర్గాలు తన్నుకున్నారు. బహిరంగంగానే ముష్టి యుద్ధానికి దిగారు. టీపీసీసీ పేపర్ లీకేజీ ఘటనపై రేవంత్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు దీక్షలో ఈ ఘటన చోటు చేసుకుంది. pic.twitter.com/aKZCygZCkJ
— Namasthe Telangana (@ntdailyonline) March 19, 2023