హైదరాబాద్ : జోగులాంబ గద్వాల : గద్వాల(Gadwala) కాంగ్రెస్లో(Congress) వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హస్తం పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం( Election campaign) చేపట్టారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జీలు సరిత, సంపత్కుమార్ అధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు.
ప్రచార రథంపైకి ముఖ్య నేతలతోపాటు సీనియర్ నేత బండ్ల చంద్రశేఖర్రెడ్డి, ఆయన తమ్ముడు బండ్ల రాజశేఖర్రెడ్డి ఎక్కడానికి వెళ్లారు. అయితే మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన పార్టీ నేత రామకృష్ణ మా మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఇతర మండలాలకు చెందిన నాయకులు ఎక్కవద్దని చంద్ర శేఖర్రెడ్డి, అతడి తమ్ముడిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రామకృష్ణ వర్గీయులు చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశారు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.