జడ్చర్లటౌన్, ఆగస్టు 20 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. నసుర్లాబాద్ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ప్రజాహిత పాదయాత్రలో భాగంగా ఆదివారం నసుర్లాబాద్ గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్రెడ్డి..
ప్రణీల్చందర్పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు అనిరుధ్ను నిలదీసేందుకు వెళ్లారు. కాంగ్రెస్ వర్గీయులు పార్టీ జెండా కర్రలతో ఎదురుదాడికి దిగారు. ఒక్కసారిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ప్రణీల్చందర్ చేతికి గాయమైంది. ఇరువర్గాల గొడవతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.