కామారెడ్డి, మార్చి 20: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
ఆదివారం గాంధారిలో నిర్వహించిన సమావేశంలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యతను మాజీ మంత్రి షబ్బీర్ అలీ చూ స్తానని ఏ హోదాలో అన్నారని ప్రశ్నించారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ కష్టపడిన వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.