Revanth Reddy | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘ఈడెవడండీ బాబూ.. పార్టీకి శనిలా దాపురించాడు. అజ్ఞానంతో పార్టీ పరువు తీస్తున్నాడు. పార్టీని ముంచాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్లోకి వచ్చినట్టుంది’ అంటూ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీతక్కను సీఎం చేస్తామని, ఉచి త విద్యుత్ను రద్దు చేస్తామని చేసిన వ్యాఖ్య లు పార్టీకి తీరని నష్టం చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
రేవంత్ వర్గం నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పార్టీని రేవంత్ వ్యాఖ్యలు మళ్లీ పాతాళానికి దిగజార్చడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పార్టీ ఆదేశంతో ఇద్దరు ముగ్గురు నేతలు రేవంత్ వ్యాఖ్యలపై విష ప్రచారం జరుగుతున్నదంటూ అన్యమనస్కంగా స్పందించారు. మిగిలిన నేతలెవరూ ఆయన్ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం లేదు. కాగా, అమెరికా వెళ్లాక రేవంత్రెడ్డికి బాలకృష్ణ పూనినట్టున్నారని, అందుకే ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సెటైర్ వేశారు.
Minister KTR | రైతులను చంపి తినే రాబందు.. కాంగ్రెస్ : రేవంత్రెడ్డి ప్రకటనపై మంత్రి కేటీఆర్ ధ్వజం