Vemulawada | వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాల సాంప్రదాయానికి హస్తం నేతలు తూట్లు పొడిచారు. సాంప్రదాయానికి విరుద్దంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనకు వెళ్లాల్సి ఉండే. కానీ ఆ పర్యటన రద్దు అయింది. దీంతో హైదరాబాద్లో సమావేశం ఉందని చెప్పి ఒక రోజు ముందే.. పట్టు వస్త్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి సమర్పించారు. తరతరాల ఆచారానికి తూట్లు పొడవటంపై అర్చకులు మండిపడుతున్నారు. ఆలయ ఈవో, అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.