కాచిగూడ,ఫిబ్రవరి 11: బీసీల సర్వోతోముఖాభివృద్ధికి రూ.8 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెంచేలా బడ్జెట్ను సవరించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఎమ్మెల్యేలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని స్పష్టం చేశారు.
56 శాతంగా ఉన్న బీసీలకు తక్కువ కేటాయింపులు చేసి వారి మనోభావాలను కించపరిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అని ఈ బడ్జెట్తో తేటతెల్లమైనదని పేర్కొన్నారు. త్వరలో బీసీల సత్తా ఎమిటో రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, గవ్వల భరత్కుమార్, రాజేందర్, నందగోపాల్, అంజీ, పృద్వీగౌడ్, సతీశ్, జయంతిగౌడ్, అఖిల్
తదితరులు పాల్గొన్నారు.