హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల నోటిఫికేషన్లు అడిగిన నిరుద్యోగుల గొంతుకను లాఠీలతో నొకాలని చూ డటం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యు వతపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.
దిల్సుఖ్నగర్లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తూ, అక్రమం గా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారం, ని రంకుశత్వానికి నిదర్శమని మండిపడ్డారు. ఎ న్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, మెగా నోటిఫికేషన్లు ఇస్తామని ఊకదంపుడు ఉ పన్యాసాలు ఇచ్చి, గద్దెనెకిన తర్వాత నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నదని విమర్శించా రు. నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.