హైదరాబాద్, ఏప్రిల్ 30(నమ స్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాం గ్రెస్ సర్కారు రైతుబంధు ఇవ్వకుం డా రైతులకు తీర ని ద్రోహం చేస్తున్నదనడానికి సాక్షా త్తూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రైతుబంధు ఇచ్చామని కాంగ్రెస్ నే తలు చెప్తున్నది అవాస్తవమని మం త్రి ప్రకటనతో తేలిపోయిందని పేర్కొన్నారు. ఓ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ‘నా రైతుబంధు ఇంకా కొద్దిగా రావాలి అంటే, జీతాలు ఇ చ్చాక ఇస్తానన్నాడు పెద్దాయన (సీఎం)’ అని చెప్పారంటూ ఆయన వ్యాఖ్యల వీడియోను కేసీఆర్ షేర్ చేశారు.