హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది. నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. అదీగాక అట్టడుగు వర్గాలపై అడుగడుగునా అరాచకాలకు పాల్పడుతున్నది. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
డిక్లరేషన్ హామీలకు తిలోదకాలు..
ఉన్న పథకాలకూ మంగళం..
పైన పేర్కొన్న పథకాలే కాకుండా.. అసైన్డ్ భూముల పునరుద్ధరణ, పోడుపట్టాల పంపిణీ, సమ్మక్క-సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం, కొత్త ఐటీడీఏలు, సూపర్స్పెషాలిటీ వైద్యశాలలు, మొత్తంగా దళిత డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి పథకానిదీ అదే పరిస్థితి. కాంగ్రెస్ హామీలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న పథకాలకూ ప్రస్తుత రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా మంగళం పలుకుతున్నది. దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో విద్యనందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు బకాయిలు విడుదల చేయడం లేదు. రాజీవ్ యువవికాసం పేరిట ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్ను నిర్వీర్యం చేస్తున్నది. సబ్ప్లాన్ నిధులు సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు.
అడుగడుగునా అరాచకాలు..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అట్టడుగువర్గాలపై దాడులు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల ఉదంతమే అందుకు నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అసైన్ల్యాండ్ను ప్రభుత్వం కబ్జా పెడుతున్నది. ప్రభుత్వ పెద్దలే నిబంధనలకు విరుద్ధంగా దళిత, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ అనధికార ఒప్పందాలకు తెరతీశారు.