హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళ్రావు నగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తకువని, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో రేవంత్ సర్కార్ ఉన్నదని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని చెప్పారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అం దించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ను కలవడానికి యువత భారీగా తరలివచ్చింది. ఇంటింటికీ బాకీ కార్డులు పంచిన కేటీఆర్ ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదురొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుద్ధ్య పనులు రోజూ జరిగేవి. ఇప్పుడు చెత్త తీసేవారే కరువయ్యారు. మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి, ఇన్వర్టర్లు కొనుకుంటు న్నాం’ అని పలువురు మహిళలు, పెద్దలు కేటీఆర్తో తమ ఆవేదన పంచుకున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘మాకు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పనితీరు మీద పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్లోనే కాదు, రాబోయే ఎన్నికల్లోనూ మీరే విజయం సాధిస్తారు’ అని పెద్దలు కేటీఆర్ను ఆశీర్వదించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒకటీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పారని, ఇప్పటికి ఒకో మహిళకు రూ.55 వేలు బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు రూ.4 వేలు పెన్షన్ ఇవ్వకుండా ఒకొకరికి రూ.44 వేలు బాకీ ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు సూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేండ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, కేసీఆర్నే తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికలు కాగానే టూరిస్టు మంత్రులు గాయబ్
తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని కేటీఆర్ చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు. జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులేనని, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలేనని స్పష్టం చేశారు. ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్తు తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటాయని చెప్పారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.